అత్యంత వైభవంగా శ్రావణ 4వ శుక్రవారం పూజాలు


ఎoబిసి ఆగస్టు15 సాలూరు ప్రతినిధి (కనిమెరక జ్ఞానేశ్వర్) : సాలూరు ఇలవేలుపు అయిన శ్రీ కామాక్షి అమ్మవారు ఆలయంలో శ్రావణ 4వ శుక్రవారం పూజాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసారు.

ఈ రోజు శ్రీ కామాక్షి అమ్మవారు వెండి చీరలో అలంకరణగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు..

0 Comments