పబ్లిక్ గ్రీవెన్స్ కు రెండు అర్జీలు..ఎంపీడీవో కుమార్.


అనంతగిరి,మే 19 ఎం బి సి): అనంతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్( మీ - కోసం ) కార్యక్రమమునకు ప్రజల నుంచి రెండు వినతి పత్రాలు స్వీకరించడం జరిగిందని ఎంపీడీవో ఏవివి కుమార్ తెలిపారు.అనంతగిరి మండల జీనబాడు గ్రామపంచాయతీ ప్రజలు పెదగంగవరం గ్రామం నుండి భూలోకమ దేవాలయం వరకు సీసీ రోడ్డు కొరకు పెదగంగవరం గ్రామం నుండి సదరు గ్రామానికి గల స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని రెండు వినతి పత్రాలు సమర్పించారని,వాటిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుందని , ఈ పి జి ఆర్ ఎస్ ( మీ కోసం)కార్యక్రమం మండల కేంద్రము నందు ప్రతి సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది కావున ప్రజలు అందరు కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పత్రిక ముఖంగా ఎంపీడీవో కుమార్ తెలియపరిచారు.

0 Comments