సాలూరు శ్యామలాంబ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

శ్యామలాంబ తల్లికి పసుపు,కుంకుమ,పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులు 


ఎంబిసి సాలూరు: తోట వీధిలోనున్న సాలూరు ప్రజల ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారిని మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం & మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు,ఏపీ వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు రాజన్నదొర దంపతులు దర్శించుకుని అమ్మవారికి పసుపు,కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి దంపతులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వాగతించారు.ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

0 Comments