ఆదివాసీలకు ఆహ్వానం

ఆదివాసీలకు ఆహ్వానం

ప్రియమైన మేధావులారా!

మే 16 న పాడేరు లో ఆదివాసీ సంఘాల సమావేశం ను జయప్రదం చేయండి


అరకులోయ, మే 14, ( ఎంపీసీ న్యూస్): ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కోసం ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ గా ఆదివాసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా, విద్యార్థి, మహిళా సంఘాలు మరియు స్వచ్చంద సంస్థలు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖ లో ఉన్న ఆదివాసీ ఉద్యోగస్తులతో ఏర్పడింది.

ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ అధ్యర్యంలో ఇప్పటి వరకు నిర్వయించిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభ్యత్వ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ప్రకటన చేశారు.

 సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనలో మరింతగా స్పష్టత కు ఆదివాసీ సమాజం రావాలి. దీనితో పాటు ప్రభుత్వం మాత్రం మెగా డీఎస్సీ నుండి దాటావేసే ధోరణి తో వ్యవరిస్తోంది. మెగా డీఎస్సీ తో పాటు ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, లేదా మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్స్ పోస్ట్ లు భర్తీ చేయకుండా మినహాయించి తరువాత ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ ద్వారా స్థానిక ఆదివాసీలతో టీచర్స్ పోస్ట్ లు భర్తీ చేయాలనీ ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్ చేస్తోంది. పై డిమాండ్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనా ఉత్తర్వాలు ఇవ్వకుండా మెగా డీఎస్సీ నిర్వహించడం వల్ల ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ యువతకు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ అధ్యర్యంలో అన్ని గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా సంఘాలతో పాటు డీఎస్సీ అభ్యర్థులతో మే 16 న పాడేరు లో సమీక్ష సమావేశం మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన ఉంటుంది. కావున అందరు పాల్గొని ఉద్యమానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమబినదానలాతో ఆహ్వానించు వారు ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన సమన్వయ కర్తలు.కూడ రాధ కృష్ణ, వల్ల వెంకట రమణ సలీమ్ మాస్టర్, సాగిన ధర్మాన పడాల్,వంతలానాగేశ్వరారావు,గంపరాయి బాను, పులి అశోక్, తెలియజేశారు.

0 Comments