వేతన...వేదన..ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలల వేతనాలు చెల్లించాలి


ఏపి బ్యూరో చీఫ్ ఎంబిసి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల విషయంలో ఏరు దాటినంకతెప్ప తగిలేసినట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవరిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు బలబద్దర్ ఆరోపించారు. గురువారం ఆయన అరకులోయ మండలంలోని గన్నెలలో పర్యటించి పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆయన మాట్లాడుతూ..క్షేత్ర సహాయకులకు 3 నెలలుగా వేతనాలు అందాక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులే కాదు ఉపాధి కూలీలకు పనులు చూపే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా క్రమ బద్దీకరిస్తామని వాటిని పేస్కేలు అమలు చేయడంతోపాటు వేతనం పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని బడాయి మాటలు చెప్పారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న క్రమబద్ధీకరణ మాట దేవుడేరుగు కనీసం ఫీల్డ్ అసిస్టెంట్లకు అందించే నెలవారీ వేతనాలు కూడా సక్రమంగా అందజేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఏనెల కానెల చెల్లించాల్సిన జీతాలు మూడు నెలలు కావస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయకపోవడంతో కుటుంబాలను పోషించలేక పోతున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్లకు క్రమబద్ధకరించి మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని తెలిపారు.

0 Comments