వీర జవాన్ మురళి నాయక్ కు నివాళి


అల్లూరి జిల్లా ఎంబిసి ప్రతినిధి: భారత్ పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసంప్రాణ త్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్ కు అరకులోయ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం హృదయ నివాళులర్పించారు.కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర కో.ఆర్డినేటర్ సోమేశ్వరరావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి కొవ్వొత్తులతో దీపారాధన చేశారు.ఆయన మాట్లాడుతూ..దేశ భద్రత కోసం పోరాడి ప్రాణాలర్పించిన మురళి నాయక్ లాంటి వీరులు దేశానికి గర్వకారణన్నారు. వారి త్యాగాలను మర్చిపోలేం ఈ తరం యువతలో దేశభక్తిని పెంపొందించాలంటే ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సంఘటనలను గుర్తుంచుకుంటూ నివాళులర్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చినస్వామి ప్రసన్నకుమార్ బుజ్జిబాబు రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

0 Comments