డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వంలో "మోద కొండమ్మ తల్లి జాతర 2025" పై త్వరలో ఏఐ సాంగ్ విడుదల

డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వంలో "మోద కొండమ్మ తల్లి జాతర 2025" పై త్వరలో ఏఐ సాంగ్ విడుదల


విశాఖపట్నం ఎంబిసి : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, గిరి ప్రజలకు కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే మహా శక్తి స్వరూపిణి, వి మాడుగుల వెలసిన తల్లి "మోద కొండమ్మ తల్లి జాతర 2025" సందర్భంగా ప్రముఖ దర్శకుడు డాక్టర్ మణి భూషణ్ గారి రచన దర్శకత్వంలో తొలి ఏఐ సాంగ్ "మోద కొండమ్మ తల్లి జాతర 2025" రూపొందుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ

ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులందరికీ ఈ పాట నేత్రానందం కలిగిస్తుందని, మనస్సులను రంజింపజేసేలా ఉంటుందని తెలిపారు. హీరో నిర్మాత ఆదిత్యభూషణ్ యొక్క ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రతిభను సమాజానికి ఉపయోగపడేలా వినూత్న రీతిలో ఈ పాటను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.

ఇటీవల చందానోత్సవం పై విడుదల చేసిన ఏఐ సొంగ్ ఎంతోమంది భక్తుల ప్రశంసలుపొందింది అని, అదే స్పూర్తితో ఇప్పుడు ప్రజల మరియు అమ్మవారి ఆశీస్సులతో ఈ పాట త్వరలో ఆఫీషియల్ టీవీ టూరిజం ఛానల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబడుతుందని ఆయన వెల్లడించారు అమ్మవారి దర్శనం నిజంగా ఒక వరమని, ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రకృతికి నిలయమని డాక్టర్ మణి భూషణ్ కొనియాడారు. ఈ సందర్భంగా సీఈఓ సీతారామస్వామి, ఎడిటర్ నీరజభూషణ్ మరియు టీవీ టూరిజం టీం అమ్మవారిని, ఆలయాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

0 Comments