పెద్దపులి దాడిలో రెండు పశువులను మృత్యువాత..VEDIO


అల్లూరి సీతారామరాజు జిల్లా ఎంబిసి: అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి చిన్నకోనల గ్రామ అటవీ ప్రాంతంలో  కోటపర్తి.గంగులు అనే రైతుకు చెందిన పశువులు శనివారం ఉదయం అడవికి మేతకు వెళ్లి ఉండగా అందులో పెద్దపులి దాడిలో రెండు పశువులను మృత్యువాత పడ్డాయని ఆదివారం  గ్రామస్తులు తెలిపారు.పులి దాడిలో రెండు పశువులు మృత్యువాత పడడంతో గంగులుకి తీవ్ర నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే నెల మూడో తేదీన చిన్నకోనల అటవీ ప్రాంతంలో వీర్రాజు అనే రైతుకు సంబంధించిన మూడు లేగ దూడలు మేతకు వెళ్లి ఉండగా పెద్దపులి హతమార్చిందని గ్రామస్తులు తెలిపారు.తక్షణమే ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం స్పందించి పెద్దపులి భారి నుంచి తమను తమా పశువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే తమ గ్రామాల్లో నేటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రుళ్ళు బిక్కుబిక్కుమని కాలం వెలదీస్తున్నామని వాపోతున్నారు.సంబంధిత ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం స్పందించి పులి దాడిలో పశువులను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఈ సమస్యను పరిష్కరించాలని చిన్నకోనల గ్రామాల గిరిజనులు కోరారు.

1 Comments