బైకు నేరస్థుడిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు

- విజయనగరం సిసిఎస్ ఇన్స్పెక్టరు ఎస్.కాంతారావు


విజయనగరం MBC; పట్టణం కలెక్టరేట్ పరిసరాల్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామానికి చెందిన రౌతు శంకర్రావు (42 సం.లు) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా సిసిఎస్ ఇన్స్పెక్టరు ఎస్. కాంతారావు ఆగస్టు 25న తెలిపారు. సిసిఎస్ పోలీసులు మరియు 1వ పట్టణ పోలీసులు సదరు వ్యక్తిని విచారణ చేయగా తాను చెడు వ్యసనాలకు అలవాటు పడి, అవసరాల కోసం బైకు దొంగతనాలకు పాల్పడి, వాటిని ఖర్చుల నిమిత్తం అమ్మి వేసేవాడినని తెలిపారన్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరం జూన్ మాసంలో విజయనగరం పట్టణానికి నిందితుడు రౌతు శంకర్రావు వచ్చి, కంటోన్మెంట్ గణేష్ కోవెలకు వెనుక ప్రాంతంలో ఒక ఇంటి వద్ద పార్కింగు చేసి ఉన్న గ్లామర్ బైకును దొంగిలించి, పాచిపెంట తీసుకొని వెళ్ళి, అమ్మివేసాడన్నారు. ఈ విషయమై మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి 1వ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. నిందితుడు రౌతు శంకర్రావు పోలీసుల విచారణలో రాజాంలో ఒక బైకును, ఒడిస్సా రాష్ట్రం పొట్టంగిలో మరో రెండు బైకులను కూడా దొంగిలించి, పాచిపెంటలో విక్రయించినట్లుగా వెల్లడయ్యిందన్నారు. నిందితుడిని ఆగస్టు 25న అరెస్టు చేసినట్లుగా సిసిఎస్ ఇన్స్పెక్టరు తెలిపారు. నిందితుడి మళ్ళీ బైకును దొంగిలించాలని లక్ష్యంతో విజయనగరం వచ్చి పోలీసులకు పట్టుబడినట్లు, అతని వద్ద నుండి మూడు బైకులను రికవరీ చేసినట్లుగా ఆయన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయుటలో 1వ పట్టణ ఎస్ఐ అశోక్ కుమార్, సిసిఎస్ ఎస్ఐ లోవరాజు, ఎఎస్ఐ గౌరీ శంకరరావు, మహ్మద్ ఇమ్రాన్ఖాన్, డి. శంకర్రావు, జి.గౌరీ శంకరరావు క్రియాశీలకంగా పని చేసినట్లుగా, వారిని అభినందించినట్లుగా సిఐ కాంతారావు తెలిపారు.

0 Comments