ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

విజేతలైన బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్..
గ్రంథాలయాలు విజ్ఞాన గనులు..
కందుకూరు ఎంబిసి ప్రతినిధి నవంబర్ 20: గత వారం రోజులుగా స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకులు డి నాగయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమం శనివారం మూసింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్కలెక్టర్ స్టేషన్ అధినేత కంచర్ల శ్రీకాంత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు డి అనురాధ హాజరయ్యారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన గనులు అని అన్నారు పుస్తకపఠనం ఎంతో ప్రాధాన్యత కలదు ప్రతి రోజు ఒక గంట సమయం పుస్తక పఠనానికి విద్యార్థులు కేటాయిస్తే తమ మేధో సంపత్తిని పెంపొందించుకొని అని అన్నారు. వారంరోజులుగా వారోత్సవాలు నిర్వహిస్తున్న అభినందించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నేటి డిజిటల్ సేవలు వినియోగం రావడంతో పుస్తకపఠనం అటకెక్కిన ఆ విధమైన పద్ధతులు మంచివి కాదని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకొని నిరంతర పరిశోధన చేస్తే అత్యుత్తమ మేధావులుగా భావిస్తారు అని విద్యార్థులకు పిలుపునిచ్చారు అనంతరం గత వారం రోజులుగా జరిగిన పోటీల్లో విజేతలైన బాలబాలికలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు శేషగిరి రావు వీ వీ శేషయ్య ఆమెదిశెట్టి వెంకటేశ్వర్లు దండోరా దాసు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments